Aishwarya Lekshmi : హీరోయిన్ నుంచి నిర్మాత..

ప్రస్తుత కాలంలో నటి నటులకు భాషలతో సంబంధం లేదు. కాస్త టాలెంట్ ఉంటే.. అన్ని భాషల సినిమాల్లో కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో మలయాళ, తమిళ నటీ నటులు కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నటి ఐశ్వర్యా లక్ష్మి. మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ కోలీవుడ్ లో కూడా చాలా సినిమాలు చేసింది. ఇటీవల సత్యదేవ్ నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అలాగే మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ – 1 లో పూంగుళలి అనే పాత్ర చేసి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో అమ్ము అనే సినిమా చేస్తుంది. దీంతో పాటు తమిళ, మలయాళంలో కలిసి మొత్తం మరో ఐదు సినిమాలకు సైన్ చేసింది. ఇందులో పొన్నియిన్ సెల్వన్ -2 కూడా ఉంది.

ఇటు నటిగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇప్పటికే ఈ బ్యూటీఫుల్ హీరోయిన్.. గార్గి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. తాజాగా మరోసారి నిర్మాత అవతారం ఎత్తింది. ప్రస్తుతం ఈమె తమిళ, మలయాళ భాషల్లో కుమారి అనే పేరుతో ఒక సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

- Advertisement -

ఈ కుమారి సినిమాఒక పురాణ ఇతిహాస జోనర్లో రూపొందిన థ్రిల్లర్ మూవీ గా రాబోతుందని తెలుస్తుంది. రొటీన్ కు భిన్నంగా కొత్తగా ఈ సినిమాను నిర్మిస్తున్నారని టాక్. అక్టోబర్ 28న తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే.. ఐశ్వర్య లక్ష్మీ మరిన్నీ సినిమాలకు నిర్మాతగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు