Aishwarya Lakshmi: లైంగిక వేధింపులకు గురయ్యాను

మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమై ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి ఐశ్వర్య లక్ష్మి. ఈమె ఈ ఏడాది టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే చిత్రంలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. కానీ ఆ సినిమాతో ఈమెకు ఇలాంటి గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత అమ్ము, కుమారి, ఇటీవల విడుదలైన మట్టి కుస్తీ సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి తన చిన్నతనంలో జరిగిన ఓ సంఘటనని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

తాను కూడా తన చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ” నా చిన్నతనంలో ఒకరోజు కుటుంబంతో కలిసి కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్ళాం. అక్కడ ఓ యువకుడు నాతో దురుసుగా ప్రవర్తించాడు. నా ప్రైవేట్ పార్ట్స్ ని తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆరోజు జరిగిన సంఘటన ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆరోజు నేను పసుపు రంగు బట్టలు వేసుకున్నాను. అప్పటినుంచి పసుపు బట్టలు వేసుకోవాలంటే భయం. కానీ ఇప్పుడు కాదు”. అని చెప్పుకొచ్చింది ఐశ్వర్య లక్ష్మి. అయితే మట్టి కుస్తి సినిమాలో ఐశ్వర్య పసుపు బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆమె తన చిన్నప్పటి సంఘటనని గుర్తుచేసుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు