Aishwarya Rajesh: ముగ్గురు పిల్లల తల్లిగా

అందం ఉన్నా కూడా అదృష్టం కలిసి రాక కొన్నేళ్లపాటు వెలుగులోకి రాలేదు ఐశ్వర్య. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఔరా అనిపించింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తమిళనాట స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ భామ తెలుగులో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాకు స్పెషల్ క్రిటిక్ అవార్డు అందుకుంది. మరోవైపు తమిళ నాడు నుంచి బెస్ట్ యాక్ట్రెస్ గా సైమా అవార్డు అందుకుంది. అయితే కెరీర్ ఆరంభ దశలోనే కాకా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించి తన నట జీవితానికి గట్టి పునాదులు వేసుకున్న నటి ఐశ్వర్య రాజేష్. ఆ తర్వాత కథ బలమున్న చిత్రాల్లో నటిస్తూ హీరోయిన్ ఓరియంటెడ్ కథ చిత్రాల నాయకిగా ఎదిగారు.

తాజాగా ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటించనుండడం విశేషం. ఈ చిత్రం పేరు ఫర్హనా. ఇంతకుముందు ఒరునాల్ కత్తు, మాన్స్టర్ చిత్రాలతో విజయాలను అందుకున్న దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. వైవిద్య భరిత కథ చిత్రాలు నిర్మాణ సంస్థ డ్రీమ్ భార్యర్ పిక్చర్స్ పథాకంపై ఎస్ ఆర్ ప్రకాష్, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రమిది.

నటి ఐశ్వర్య రాజేష్ టైటిల్ పాత్రను పోషిస్తున్న ఇందులో నటుడు రమేష్ చాలా కీలకపాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా ఐశ్వర్య దత్ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఇందులో దర్శకుడు సెల్వ రాఘవన్ స్పెషల్ ఆపిరెన్స్ ఇవ్వడం విశేషం. దీనికి జస్టిస్ ప్రభాకర్ సంగీతాన్ని, గోకుల్ పినాయ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు