Ajith : రూ.280 కోట్ల బిజినెస్ ?

కోలీవుడ్ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. నెర్కొండ పార్వాయి,  వలిమై వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హెచ్. వినోద్ తో తునివు అనే చిత్రంలో నటిస్తున్నాడు అజిత్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని జీ స్టూడియోస్ తో కలిసి బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూర్చుతున్నాడు.  అజిత్ – వినోద్  కాంబోలో మూడో చిత్రం కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.  ఈ సినిమా ఇప్పటికే సంక్రాంతికి విడుదల చేసేందుకు ఫిక్స్ చేశారు.

తమిళంలో అయితే విజయ్ వరిసు, అజిత్ తునివు చిత్రాలు పోటాపోటీగా విడుదలవుతున్నాయి. తెలుగులో కూడా విడుదలవుతున్నప్పటికీ చిరంజీవి, బాలయ్య సినిమాలకు ఉన్నంత పోటీ తెలుగులో వీరి సినిమాలకు ఉండదనే చెప్పాలి. తమిళంలో విజయ్, అజిత్ సినిమాలు అంటే అభిమానులు పండుగ చేసుకుంటారు. ఇక అందులో సంక్రాంతి పండుగ వేళ వస్తున్న ఈ సినిమాలపై క్రేజ్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఇదిలా ఉంటే సంక్రాంతికి పండుగకి వస్తున్న ‘తునివు’ నుంచి తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ బయటికి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అదేవిధంగా తునివు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించి పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఏకంగా రూ.280 కోట్ల బిజినెస్ జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తి కాలేదని సమాచారం. త్వరలోనే అన్ని బిజినెస్ ఫైనల్ అవ్వనున్నట్టు తెలుస్తోంది. కేవలం రూ.280 కోట్ల బిజినెస్ అనేది ఒక రూమర్ మాత్రమే అని తెలుస్తోంది. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు