Ramarao On Duty : నష్టమంతా ఆ నటుడికే ?

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల అయింది. రాజీషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లు గా నటించారు. అలాగే కీలక పాత్రలో వేణు తొట్టెంపూడి నటించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాపై విడుదలకు ముందు అంచనాలు భారీగానే ఉండేవి. ఖిలాడి ప్లాప్ తర్వాత రవితేజకు మంచి హిట్ లభిస్తుందని ఫ్యాన్స్ భావించారు.

కానీ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తు రామారావు ఆన్ డ్యూటీ దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. రవితేజ వంటి హీరో చేయాల్సిన సినిమా కాదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మాస్ మహారాజా గ్రేస్ సినిమాలో ఎక్కడా కనిపించలేదని కామెంట్స్ చేశారు. రవితేజ స్టైల్ కామెడీ, యాక్షన్ సీన్స్ ఎక్కడా లేవని ఫ్యాన్స్ కూడా అన్నారు. తొలిరోజు కలెక్షన్లు కూడా దారుణంగానే వచ్చాయి. తొలిరోజు రూ. 3.30 కోట్ల షేర్‌ ను రాబట్టింది. రవితేజ హీరోగా దీనికి ముందు వచ్చిన ఖిలాడి ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్లాప్ సినిమా కూడా తొలిరోజు రూ. 6 కోట్లకుపైగా కలెక్షన్లు తెచ్చింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. ఒక నిర్మాతలకే కాదు, ఈ సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన వేణు తొట్టెంపూడికి కూడా రామారావు నష్టాలనే మిగిల్చింది. నష్టాలంటే డబ్బులు పరంగా కాకుండా, కెరీర్ పరంగా వేణు నష్టపోయాడు. రవితేజ సినిమాపై నమ్మకం పెట్టుకున్న వేణు, ఈ సినిమా హిట్ అయితే వరుసగా అవకశాలు వస్తాయని అనుకున్నాడు. కానీ రామారావు ఆన్ డ్యూటీ ఫలితాన్ని చూసిన తర్వాత అది జరగడం కష్టమే అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు