Harish Shankar: మైత్రి మూవీ మేకర్స్ “దిష్టి” తీయించుకోవాలి

మైత్రి మూవీ మేకర్స్ సక్సెస్ ఫుల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిపోయింది. రవితేజ నటించిన “అమర్ అక్బర్ ఆంటోని” సినిమాను మినహాయిస్తే చేసిన ప్రతి సినిమా మంచి హిట్ అయింది.
కేవలం హిట్ సినిమాలే కాదు శ్రీమంతుడు, రంగస్థలం , పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయ్ ఈ బ్యానర్ లో.

ఈ రోజు రిలీజైన “సర్కారు వారి పాట” సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాపై ప్రసంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ సినిమాని చూసిన హరీష్ శంకర్ సర్కారు వారి పాటలో మహేష్ స్వాగ్, టైమింగ్ అదిరాయని. నిజంగా ఈ సినిమా చూడటం ఒక ట్రీట్ అని, దర్శకుడు పరశురామ్ తన రైటింగ్ స్కిల్స్ తో హిలేరియస్ గా నటీనటుల నుంచి పెర్ఫామెన్స్ లను రాబట్టారని చెబుతూ, ఈసారి ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన “మైత్రి మూవీ మేకర్స్” దిష్టికోవాలని సినిమా స్టయల్ లో ట్వీట్ చేసారు. ప్రస్తుతం హరీష్ శంకర్ ఈ బ్యానర్ లోనే పవన్ కళ్యాణ్ తో “భవదీయుడు భగత్ సింగ్” సినిమా చేస్తున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు