Pushpa 2 : సుకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 360 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఈ సినిమాను ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీంతో ఆ మూవీకి సీక్వెల్ “పుష్ప ది రూల్” మరింత ఆసక్తిగా ఉండేలా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

పుష్ప 2 చిత్రీకరణ అక్టోబర్ 30, 2022న ప్రారంభించిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో కొన్ని రోజులపాటు ఈ మూవీ చిత్రీకరణ జరిగింది. ఇక మరో షెడ్యూల్ షూటింగ్ ని కూడా ఇటీవల విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ప్రారంభించారు. ఫిబ్రవరి నుంచి రష్మిక మందన సెట్స్ లో జాయిన్ అవుతారని మూవీ యూనిట్ ఇటీవల స్పష్టం చేసింది. ఈ షెడ్యూల్ లో భారీ తారాగణం పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

అయితే తాజాగా సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కావడంపై డైరెక్టర్ సుకుమార్ సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ పుష్ప గెటప్ లో కుర్చీలో కూర్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు జాగ్రత్తగా ఉండండి అంటూ చిత్ర యూనిట్ కి సూచనలు చేశారు. ఇలా షూటింగ్ స్టార్ట్ చేయగానే లీకుల సెగ తగలడంతో సుకుమార్ చిత్ర యూనిట్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు