Anushka Sharma: పోటీపడి నటించే ఆలోచన లేదు

బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ తన నటనతోనే కాదు తన అందచందాలతోనూ ఆకట్టుకుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకున్న ఈ భామ ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే తాజాగా టీమ్ ఇండియా స్టార్ బౌలర్ జూలన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “చెక్దా ఎక్స్ ప్రెస్”. ఈ బయోపిక్ లో గోస్వామి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నటిస్తోంది. ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. ఇక ఈ మూవీలో భారత క్రికెట్ కు గోస్వామి అందించిన సేవలను, సాధించిన రికార్డులను చూపించనున్నారు. ఈ చిత్రానికి ప్రొసీత్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా.. అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్నేష్ శర్మ క్లీన్ ప్లేట్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

అలాగే మనోజ్ ఆనంద్, అతుల్ శర్మ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క శర్మ ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాక నటిగా నా ప్రాధామ్యాలు మారిపోయాయి. నా పాపని చూసుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను. గతంలో లాగా పోటీపడి నటించే ఆలోచన లేదు. మంచి అవకాశాలు వస్తేనే నటిస్తాను. హీరోయిన్ గా కొనసాగాలని మాత్రం సినిమాలు ఒప్పుకోను. ఎందుకంటే అలా వృధా చేసేంత సమయం నా దగ్గర లేదు” అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శర్మ.

For More Updates :

- Advertisement -

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు