Bala Krishna: ఇది ఫ్యాక్షన్ కాదు.. ఎమోషన్.

నటసింహా నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందిన పవర్ ఫుల్ మూవీ ”విరసింహారెడ్డి”. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై యలమంచిలి రవి, నవీన్ యుర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి స్టార్లు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపేందుకు చిత్ర బృందం గురువారం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ” వీర సింహారెడ్డి సినిమా ఫ్యాక్షన్ సినిమా కాదు. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చాటే సినిమా. ప్రేక్షకుల ప్రోత్సాహంతో మంచి చిత్రాలు చేసేందుకు కష్టపడతా. ఓ హిట్ సినిమా తర్వాత మరొకటి వస్తుందంటే అంచనాలు పెరుగుతాయి. అఖండ తర్వాత తెరకెక్కిన వీర సింహారెడ్డి విషయంలో అదే జరిగింది” అన్నారు.

”సాయి మాధవ్ బుర్ర అద్భుతమైన సంభాషణలు రాశారు. నేపద్య సంగీతంతో సన్నివేశాలను తమన్ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లారు. హీరో, విలన్ పాత్రల తీరుకు తగ్గట్టు ఫైట్ మాస్టర్లు రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేశారు. థియేటర్లలో వరలక్ష్మి శరత్ కుమార్ పోషించిన పాత్రను చూసిన ప్రేక్షకులు సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రచార చిత్రాల్లో ఆ క్యారెక్టర్ ను ఎక్కువగా రివీల్ చేయొద్దని చెప్పా. హీరోయిన్ శృతిహాసన్ చక్కగా నటించింది. మూవీ యూనిట్ అందరికీ కృతజ్ఞతలు” అన్నారు బాలకృష్ణ.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

 

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు