NBK: నర్సులకు క్షమాపణలు చెప్పిన బాలయ్య

నందమూరి బాలయ్య… ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తున్నారు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలయ్య ఈమధ్యనే… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి సందర్భంగా విడుదలైన “వీర సింహారెడ్డి” సినిమాతో కూడా మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడే బాలయ్య… ఎప్పటికప్పుడు తన మాటలతో ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో దేవా బ్రాహ్మణుల గురించి చేసిన కామెంట్లతో వారి మనోభావాలను దెబ్బతీసిన బాలయ్య… ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీ పై కూడా కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు.

ఈ వివాదం ఇప్పటికీ టాలీవుడ్ లో కొనసాగుతూనే ఉంది. ఇంకా తాజాగా మరోసారి తన వైఖరితో బాలయ్య వివాదంలో ఇరుక్కున్నారు. బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ ష్టాపబుల్ సెలబ్రిటీ టాక్ షో లో నర్సులను కించపరుస్తూ మాట్లాడారు. దీంతో ఏపీవ్యాప్తంగా బాలయ్యకు వ్యతిరేకంగా ధర్నాలు మరియు నిరసనలు తెలిపారు నర్సులు. బాలయ్య వెంటనే స్పందించి.. క్షమాపణలు చెప్పాలంటూ నర్సులు డిమాండ్ చేశారు.

దీంతో చేసేదేమీ లేక ఈ వివాదం పై బాలయ్య స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు బాలయ్య. “అందరికీ నమస్కారం, నర్సులను కించపరిచాను అంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలు అందించే నా సోదరీమణులు అంటే నాకెంతో గౌరవం ” అంటూ బాలయ్య పేర్కొన్నారు.

- Advertisement -

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు రోగులకు సేవలు చేసి ప్రాణాలు నిలిపే నర్సులకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానని తెలిపారు. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎంతోమంది నర్సులు… రోగులకు ఎంతగానో సేవలు అందించారని గుర్తు చేశారు బాలయ్య. అలాంటి నరుసులను మనం మెచ్చుకొని తీరాలి అని కోరారు. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే పశ్చాత్యాపం వ్యక్తం చేస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాలయ్య. అయితే బాలయ్య సోషల్ మీడియాలో చేసిన ఈ వ్యాఖ్యలపై నర్సులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు