Vyuham: ఎలక్షన్ల ప్రచారానికి సిద్ధమవుతున్న బయోపిక్ సినిమాలు?

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ల ప్రచారాలలో సినిమాల ప్రాధాన్యత చాలా ఉంటుంది. నాటి ఎన్టీఆర్ నుండి నేటి జగన్ వరకు సినిమాలను ప్రమోషన్లుగా వాడుకొని గెలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అప్పట్లో ఎన్టీఆర్ ఎలక్షన్లలో గెలిచి సీఎం కావడానికి మేజర్ చంద్రకాంత్ సినిమా చాలా దోహదపడింది. అటు సూపర్ స్టార్ కృష్ణ కూడా తాను నటించిన “ఈనాడు” చిత్రం ద్వారా టిడిపి కి సపోర్ట్ చేస్తూ సినిమా తీసాడు.

అయితే ఈ సినిమాల ద్వారా పాజిటివ్ గా కాకుండా నెగిటివ్ ప్రచారానికి కూడా వాడుకోవడం ఈ మధ్య మామూలైపోయింది. ఇటు చిత్ర యూనిట్లకు కూడా రాజకీయనాయకులు పరోక్షంగా డబ్బులిచ్చి సినిమాలు తీయిస్తున్నారు. గతంలో వచ్చిన రామ్ గోపాల్ వర్మ చిత్రాలైన “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”, “లక్ష్మీస్ ఎన్టీఆర్” లాంటి సినిమాలు ఈ కోవలోకి చెందినవే.

అయితే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ దగ్గరకి వస్తున్న సమయంలో చిత్ర పరిశ్రమ నుండి ఆయా రాజకీయ పార్టీల కోసం పలువురి సినిమాలు సిద్ధం అవుతున్నాయి. ముందుగా వైసిపి కి అనుగుణంగా మహి.వి. రాఘవ దర్శకత్వంలో యాత్ర2 సినిమాను రెడీ చేస్తున్నారు. గతంలో ఇదే డైరెక్టర్ మమ్ముట్టి తో తీసిన వైస్సార్ బయోపిక్ “యాత్ర” మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా జగన్ బయోపిక్ గా తమిళ నటుడు జీవాను హీరోగా పెట్టి తీయనున్నారు.

- Advertisement -

ఇక రామ్ గోపాల్ వర్మ తీస్తున్న “వ్యూహం” కూడా ఎలెక్షన్లలో భాగంగా తీస్తున్న సినిమాయే. అయితే అది వైసీపీ కి అనుగుణంగానా లేక ప్రతికూలంగానా అనేది తెలియాల్సింది. ఇక ఇవే గాక తెలంగాణ లో కెసిఆర్ పై ఒక బయోపిక్ కూడా త్వరలోనే రానుంది. ఇంకా ఎలక్షన్స్ కి ఆరు నెలలుండడంతో మరి అప్పటివరకు ఇంకెన్ని సినిమాలు సిద్ధమవుతాయో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు