Anupam Kher : రవితేజ కోసం బాలీవుడ్ స్టార్

మాస్ మహారాజా రవితేజ “క్రాక్” సినిమాతో చాలా రోజుల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు. క్రాక్ లాంటి భారీ హిట్ తరువాత రవితేజ వరుస ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. అయితే ఇటీవల “రామారావు ఆన్ డ్యూటీ” బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. ఈ ఫలితంతో సంబంధం లేకుండా రవితేజ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి “టైగర్ నాగేశ్వరరావు”. రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 1970లో స్టువర్టుపురం ప్రాంతంలో గజదొంగ గా పేరు మోసిన “టైగర్ నాగేశ్వరరావు” జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం లెజెండరీ యాక్టర్, నేషనల్ అవార్డు గ్రహీత అనుపమ్ ఖేర్ ని ఎంపిక చేశారు.

కాగాఎంఎస్ ధోని బయోగ్రఫీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అనుపమ్ ఖేర్. అలాగే ఇటీవల “ది కాశ్మీర్ ఫైల్స్” సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. దీంతోపాటు నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన “కార్తికేయ 2” సినిమాతో మరోసారి అనుపమ్ ఖేర్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మళ్లీ ఇప్పుడు రవితేజ సినిమాలో నటిస్తూ ఉండడంతో “టైగర్ నాగేశ్వరరావు” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించిన స్టిల్ ను అనుపమ్ ఖేర్ మంగళవారం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తాను నటిస్తున్న 528వ చిత్రానికి సంబంధించిన విశేషాలు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అయితే “ది కాశ్మీరీ ఫైల్స్” చిత్రం నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ సినిమా నిర్మాత కావడం మరో విశేషం. ఈ చిత్రంలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఐదు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో రవితేజ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాతో మాస్ మహారాజా మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు