ఆ హీరోయిన్ కు బన్నీ భార్య వార్నింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం బన్నీ, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప ది రూల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో రానున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అయితే అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. 2011లో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు స్నేహారెడ్డి ఎవరో బయట ప్రపంచానికి తెలియదు. కానీ వివాహమయ్యాక అల్లు అర్జున్ భార్యగా అందరికీ పరిచయమే. అప్పటినుంచి తన కెరీర్ పై ఫోకస్ పెట్టి సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతో సమానంగా తనకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నారు అంటే స్నేహ రెడ్డి రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే తాజాగా ఈ జంటకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు బన్నీతో నటించిన హీరోయిన్స్ కొంతమంది పర్సనల్ గా ఇంకా టచ్ లో ఉండగా… వీరిలో ఓ భామ తరచూ ఫోన్ చేస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండేదట. వేరే ఉద్దేశంతో ఆయనతో కాస్త క్లోజ్ అవ్వడానికి ట్రై చేసిందని టాక్. దీంతో స్నేహారెడ్డి ఆ హీరోయిన్ కు ఫోన్ చేసి…’ఇంకోసారి ఫోన్ చేస్తే యాక్షన్ వేరే ఉంటుంది’ అని వార్నింగ్ ఇచ్చిందని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు