Captain Miller : గ్రాండ్ గా ప్రారంభం

సూపర్ స్టార్ ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. ఈ సినిమాను ఇటీవల ప్రకటించారు. ధనుష్ తో పాటు వెర్సటైల్ నటుడు సందీప్ కిషన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పటి కెప్టెన్ మిల్లర్ నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ సినిమాలో ధనుష్ కు జోడీగా ప్రియాంక మోషన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా గురువారం చెన్నైలో ప్రారంభ‌మ‌యింది. ఈ కార్యక్రమానికి ధనుష్ తో పాటు సందీప్ కిషన్, ప్రియాంక మోషన్ హాజరయ్యారు. కాగా ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రంగా కెప్టెన్ మిల్లర్ నిలుస్తుంది. 1930-40ల నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ ఫిల్మ్‌ కెప్టెన్ మిల్లర్ ఉంటుందని మేకర్స్ తెలిపారు.

బాహుబలి ఫ్రాంచైజీ, RRR మరియు పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ రాశారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని జి. శరవణన్, సాయి సిద్ధార్థ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ ను తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు