Chiranjeevi: మరోసారి అరవ డైరెక్టర్‌తో ప్రయోగం ?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వరుసగా సినిమాలకు సైన్ చేశాడు. అందులో అన్ని సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. భోళా శంకర్ ఒకటి.. మాత్రమే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. భోళా శంకర్ తర్వాత మెగాస్టార్ చేసే సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పూరీ జగన్నాథ్, వి వి వినాయక్ తో పాటు పలువురు డైరెక్టర్లు చిరుకు కథ వినిపించారని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ ఫిక్స్ కాలేదని తెలుస్తోంది.

అయితే కోలీవుడ్ లో మెగాస్టార్ తర్వాత సినిమా గురించి ఆసక్తికరమైన గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదేంటంటే.. మెగాస్టార్ తన తర్వాత సినిమాను కోలీవుడ్ కి చెందిన డైరెక్టర్ తో చేయబోతున్నాడట. ఇటీవల కార్తీతో సర్దార్ అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టిన పి ఎస్ మిత్రన్ తో చిరంజీవి సినిమా చేయడానికి రెడీ అయినట్టు కోలీవుడ్ మీడియాలో కోడై కూస్తుంది.

చిరంజీవి ఇటీవల కోలీవుడ్ కి చెందిన మోహన్ రాజతో గాడ్ ఫాదర్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ ఇప్పుడు తమిళ దర్శకుడితో చిరు సినిమా చేయబోతున్నాడు అంటే మెగా ఫ్యాన్స్ కొంత వరకు హ్యాపీగానే ఉన్నారు. అయితే మెగాస్టార్, పి ఎస్ మిత్రన్ తో వచ్చే సినిమా ఉంటుందని, అది భోళా శంకర్ తర్వాత ఉండకపోవచ్చని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే ఇది నిజమని తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు