Chiranjeevi : వైవిధ్యంతో కూడిన రొటీన్ స్టోరీ

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, మెగా అభిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో ప్రేక్షకుల ముందకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ పనుల్లో వేగం పెంచింది. మంగళవారం వాల్తేరు వీరయ్య కోసం వేసిన ప్రత్యేక సెట్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో వాల్తేరు వీరయ్య గురించి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. వాల్తేరు వీరయ్య రొటీన్ స్టోరీనా.. లేదా కొత్తగా ఏమైనా ఉందా? అని ఒక సినిమా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చిరంజీవి పలు వ్యాఖ్యలు చేశారు.

“వాల్తేరు వీరయ్య ఒక రొటీన్ ఎంటర్టైనర్ రాసుకోండి హెడ్ లైన్స్ లో.. కాని సినిమా లోపలికి వెళ్ళాక వేరేలా ఉంటుంది. వైవిధ్యంగా ఉంటుంది. ఇంట్లో మనం రోజూ చేసే భోజనం రొటీనే, వడ్డించే ఐటెమ్స్ వేరు అంతే. ఇది కమర్షియల్ సినిమా. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది” అంటూ వాల్తేరు వీరయ్య గురించి మెగా స్టార్ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు