Chiru-Balayya : హీట్ పెరుగుతోంది..

టాలీవుడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా మెగా స్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఇద్దరు ఇండస్ట్రీ పెద్దలుగా ఉంటున్నారు. అలాగే ఇండస్ట్రీని వీరి కుటుంబాలే శాసిస్తున్నాయి. వీని కంపౌండ్ నుంచి వచ్చిన చిన్న హీరోల సినిమాలకు కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. అలాంటిది స్వయంగా వీరి సినిమాలే రిలీజ్ అయితే.. అది కూడా ఒకే సారి.. అది కూడా టాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే సంక్రాంతి బరిలో ఉంటే. ఎలా ఉంటుందో చెప్పడం కష్టం.

ఈ సారి సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో చిరంజీవి, వీర సింహ రెడ్డితో బాలయ్య బరిలోకి దిగుతున్నారు. అటు మెగా ఫ్యాన్స్ కి, ఇటు నందమూరి అభిమానులకి ఫుల్ మీల్స్ అంతటి ఎంటర్ టైన్ మెంట్ ఖాయం. దీంతో పాటు ఆయా హీరోల అభిమానుల మధ్య పోటీ కూడా జరుగుతోంది. నిజానికి చిరంజీవి, బాలయ్య సంక్రాంతి పోటీలో ఉండటం ఇదే తొలిసారి కాదు. ఇప్పటి వరకు ఈ అగ్ర హీరోలు 9 సార్లు సంక్రాంతి పోరులో నిలిచారు.

కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఈ పోరు ఉత్కంఠగా మారింది. ఈ సారి పోరులో కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఇద్దరికి హీరోయిన్ శ్రుతి హాసన్ ఒక్కరే. ఇద్దరి సినిమాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయినా పోటీ భారీ స్థాయిలో ఉంది.

- Advertisement -

ఈ పోటీలో నిలవడానికి, గెలవడానికి ఆయా సినిమాల మేకర్స్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. బాలయ్య కూడా ప్రమోషన్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటి నుంచే ప్రమోషన్లను స్టార్ట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారట. రెండు వారాల పాటు ఏకదాటిగా బాలయ్య ప్రమోషన్లకు హాజరవుతాడని టాక్. ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలలో బాలయ్య పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నాడని సమాచారం.

అటు వాల్తేరు వీరయ్య కూడా ప్రమోషన్లుకు సన్నద్ధం అవుతుంది. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ తో మెగా స్టార్ ఫ్యాన్స్ సమావేశం అయి.. ప్రమోషన్లు, థియేటర్ ల వ్యవహారలపై చర్చించారు. దీంతో సంక్రాంతి హీట్ ఇప్పటి నుంచే ప్రారంభమైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే బాలయ్య అన్ స్టాపబుల్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడం, కొన్ని సందర్భాల్లో చిరు గురించి బాలయ్య ప్రస్తావన తీసుకురావడం వంటివి చూస్తే.. బాలయ్య-చిరు మధ్య సంక్రాంతి పోరు స్నేహపూర్వకంగా ఉంటుందని స్పష్టమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు