Chiranjeevi:రవితేజ లేకుంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణం

ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఇటీవల దీపావళి సందర్భంగా విడుదలైన టైటిల్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక వాల్తేరు వీరయ్య సినిమాకు సంబంధించి నిన్న ప్రత్యేకంగా ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

వీరయ్య సినిమాలో వేసిన ఓడరేవు సెట్ వేసి మరి మీడియాను ఆహ్వానించారు. సినిమా షూటింగ్ పూర్తయి, ఫస్ట్ కాపీ రెడీ అయి, సరిగ్గా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కొన్ని రోజుల ముందు ఇలా ప్రెస్ మీట్ పెట్టడం కాస్త కొత్త ధనమే. అయితే అంతకంటే కొత్తదనం ఏంటంటే, సినిమా చూసి ఈ ప్రెస్ మీట్ కు వచ్చారు చిరంజీవి. అనంతరం ఈ సినిమాపై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అయితే, వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ లో రవితేజ గురించి చెప్పడం మర్చిపోవడంతో స్పెషల్ ట్వీట్ చేస్తున్నట్లు చిరంజీవి చెప్పారు. ‘క్లుప్తంగా మాట్లాడదామని అనుకోవడంతో నా తమ్ముడు, వీరయ్యకి అతి ముఖ్యుడైన రవితేజ గురించి చెప్పడం మర్చిపోయాను. షూట్ చేసిన ప్రతిరోజు రవితో మళ్ళీ ఇన్నేళ్ళకి చేయటం నాకెంతో ఆనందంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రవితేజ చేయకపోయి ఉంటే వాల్తేరు వీరయ్య అసంపూర్ణంగా ఉండేది’ అని చెప్పారు.

- Advertisement -

ఇక చిరంజీవి ట్వీట్ పై రవితేజ కూడా స్పందించాడు. అన్నయ్య మీతో స్క్రీన్ పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది నా అదృష్టం. ఇక మీ ట్వీట్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ రవితేజ రిప్లై ఇచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు