‘సర్కారు వారి పాట’ కి 4.5/5 రేటింగ్ ఇచ్చిన క్రిటిక్..!

మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న విడుదల కాబోతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేష్ నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా నమోదయ్యాయి. థియేటర్ల వద్ద పండుగ వాతావరణం ఏర్పడింది. పలు చోట్ల వర్షాల వల్ల మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి చేయలేకపోతున్నారు కానీ మిగిలిన చోట్ల అయితే అప్పుడే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేసారు. చిత్ర బృందం ప్రమోషన్లలో సినిమా ఓ రేంజ్లో ఉంటుంది అంటూ హామీలు ఇచ్చేస్తున్నారు. ప్రతీ సినిమా ప్రమోషన్లలోనూ ఇదే తంతు ఉంటుంది కాబట్టి.. ఫ్యాన్స్ పెద్దగా వాటి పై అసలు పెట్టుకోరు. 
 
అయితే ఉమర్ సంధు అనే క్రిటిక్, సెన్సార్ సభ్యుడు…  ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని మరింత ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. ‘సర్కారు వారి పాట’ సినిమా సెన్సార్ షో ఇతను చూశాడట. సినిమా చాలా బాగుంది, మహేష్ ఎంట్రెన్స్ అదిరిపోయింది, అతను మునుపటి కంటే గ్లామర్ గా ఉన్నాడు. 2022 లో ఇదే బెస్ట్ మూవీ అంటూ చెప్పుకొచ్చాడు.అంతేకాదు ఏకంగా 4.5/5 రేటింగ్ ఇచ్చేసాడు. అయితే ప్రతీ పెద్ద సినిమాని విడుదలకి ముందు ఇతను ఇలాగే మూసేస్తూ ఉంటాడు, ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ వంటి చిత్రాలు కూడా ఇతను అద్భుతం అంటూ చెప్పుకొచ్చాడు. వాటి రిజల్ట్స్ ఏంటి అనేది అందరికీ తెలిసిందే.  

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు