Veera Simha Reddy : ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్

నటసింహ నందమూరి బాలకృష్ణ-శృతిహాసన్ జంటగా, క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ “వీరసింహారెడ్డి”. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇది ఇలా ఉండగా, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. థియేటర్లలో సినిమా సందడి చేయడానికి పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే చిత్రం నుంచి వరుసగా సాంగ్స్ ను విడుదల చేశారు. తాజాగా మరో కీలక అప్డేట్ ను మేకర్స్ ఇచ్చారు. ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్ ను అతి త్వరలో విడుదల చేస్తామని చిత్ర బృందం వెల్లడించింది.

తొలుత సినిమాలో బాలకృష్ణ, శ్రుతి మాస్ స్టెప్స్ వేసిన ‘మాస్ మొగుడు’ పాటను జనవరి 3న అనగా మంగళవారం రాత్రి 7 గంటల 55 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. కానీ, తాజా అప్డేట్ లో ఆ పాటను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మాస్ మొగుడు పాట విడుదలకు ముందే వీర సింహ రెడ్డి ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. కాగా ట్రైలర్ ఈ వారం చివర్లో వచ్చే సూచనలు ఉన్నాయి.

- Advertisement -

కాగా వీర సింహ రెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 6న లేదా 8న నిర్వహించనున్నట్లు టాక్. మరి ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎవరు గెస్ట్ వస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు