Aishwarya-Dhanush : విడాకులపై వెనక్కి ?

ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఆయన భార్య సూపర్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు డైవర్స్ తీసుకోవడం సర్వ సాధారణం. కానీ, ధనుష్, ఐశ్వర్య డైవర్స్ తీసుకోవడంతో సౌత్ లో కొన్ని రోజుల పాటు చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, సినిమాలతో సౌత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న ధనుష్ విడాకులు తీసుకువడం ఫ్యాన్స్ ఏ మాత్రం అంగీకరించలేదు.

18 ఏళ్లు కాపురం చేసి, ఇద్దరు పిల్లలకు తల్లి దండ్రులు అయిన తర్వాత ఇప్పుడు డైవర్స్ తీసుకోవడం చాలా మందికి నచ్చలేదు. అయితే వీళ్లు మళ్లీ కలుస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. ఇటీవల తమ పిల్లల స్కూల్ లో ఒక ఫంక్షన్ కు ఈ వీడిపోయిన జంట వచ్చింది. ఆ ఫంక్షన్ లో ధనుష్, ఐశ్వర్య కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. దీంతో వీళ్లు కలిసే అవకాశం ఉందని ఫ్యాన్స్ కొంత వరకు నమ్మకం పెట్టుకున్నారు.

ధనుష్ వాళ్ల తండ్రి కూడా ఒక సందర్భంలో వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు అని.. మాట్లాడితే సెట్ అవుతుందని అన్నారు. అయితే ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ధనుష్, ఐశ్వర్య కలిసిపోతున్నారట. వీళ్ల రజినీకాంత్, ధనుష్ వాళ్ల తండ్రి వీళ్లతో మాట్లాడని సమాచారం. పెద్దల మాటతో ధనుష్, ఐశ్వర్య కలిసిపోతున్నారని కోలీవుడ్ మీడియా చెబుతుంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు