Dhanush: స్టార్ హీరో సరసన

“తిరు” సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చిన ధనుష్ అదే జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన ” నేనే వస్తున్నా” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ” నానే వరువెన్” తెలుగులో ” నేనే వస్తున్నా” పేరుతో ఈనెల 29న విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటుగా ద్విభాషా చిత్రం “సార్” లో నటిస్తున్నాడు ధనుష్. ఈ రెండు చిత్రాలు సెట్స్ పై ఉండగానే ఇటీవలే ” కెప్టెన్ మిల్లర్” అనే పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాలతో సుపరిచితురాలు అయిన ప్రియాంక మోహన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ప్రియాంకతో పాటు నివేదిత సతీష్ కూడా ఈ చిత్రంలో భాగమని కెప్టెన్ మిల్లర్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. అరుణ్ మహేశ్వరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కూడా కీలకపాత్రలో నటించబోతున్నాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకం పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీ తమిళ, తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుందట. అంతేకాకుండా 1930 – 40 టైం పీరియడ్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు