Dhoni : కొత్త ఇన్నింగ్స్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలకి పులిస్టాప్ పెడుతూ ఎట్టకేలకు సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు మహేంద్రసింగ్ ధోని. దీపావళి పర్వదినాన భార్య సాక్షి సింగ్ ధోనీతో కలిసి ” ధోని ఎంటర్టైన్మెంట్” పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు.

ఈ సంస్థకు ధోనీ భార్య సాక్షి సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తన నిర్మాణ సంస్థకి “డి ఎంటర్టైన్మెంట్” అనే పేరుని పెట్టారు ధోని. తన మొదటి సినిమాని తమిళ్ లో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి ధోని భార్య సాక్షి కథని అందించగా.. రమేష్ తమిళమని దర్శకత్వం వహించబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీని తెరకెక్కించనున్నట్టు సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు. తమిళనాడు ధోనీకి విపరీతమైన క్రేజ్ ఉండడంతో ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై వరుస తమిళ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు సంస్థ ప్రతినిధులు. ఇక ఈ సంస్థ తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్రౌండ్ లో బ్యాట్ తో వీర విహారం చేసే ధోని సినిమా రంగంలో ఎలాంటి విజయాలను సాధిస్తాడో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు