Nani : ధూం ధాం దోస్తాన్ పోస్టర్

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న తాజా చిత్రం దసరా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. హీరో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది. అలాగే విలక్షణ నటుడు సముథ్ర ఖని కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. అంటే సుందరానికి సినిమా తర్వాత హీరో నాని ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ సినిమాతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

దసరా సినిమా నుంచి అప్ డేట్స్ రాక చాలా రోజులు అవుతుంది. నాని ఫ్యాన్స్ కూడా దసరా సినిమా నుంచి అప్ డేట్స్ కావాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. కాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన అభిమానులకు నాని సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్టర్ లో నాని తన స్నేహితులతో కలిసి ఉన్నాడు. ‘ధూమ్ ధాం దోస్తాన్.. ఇరగ మరగ చేద్ధాం’ అని కూడా ట్విట్టర్ లో రాశాడు. దీంతో ఈ పోస్టర్ లో ఉన్న వాళ్లు సినిమాలో కీలక పాత్రలో ఉంటారని అర్థమవుతుంది. అలాగే వీళ్లు నాని పాత్రలకు స్నేహితులు అని పోస్టర్ తో తెలుస్తుంది.

కాగా దసరా సినిమా షూటింగ్ 2022 ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో దసరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులో రూ.12 కోట్లతో ఓ పల్లెటూరు సెట్ వేశారు. అక్కడే చాలా వరకు షూటింగ్ జరుపుకున్నారు. దసరా సినిమా ఒక పల్లెటూరి ప్రేమకథ అని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు