Kartikeya Gummakonda : గ్యాప్ ఇచ్చాడా, గుడ్ బై చెప్పాడా ?

రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో హీరోగా మారిపోయాడు కార్తికేయ గుమ్మకొండ. ‘ఆర్.ఎక్స్.100’ కంటే ముందే ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే చిత్రంతో కార్తికేయ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, మంచి పేరు తెచ్చిపెట్టిన మూవీ మాత్రం ‘ఆర్.ఎక్స్.100’. దీని తర్వాత కార్తికేయ స్టార్ అయిపోవడం గ్యారెంటీ అనే కామెంట్లు వినిపించాయి. కానీ, అవి కామెంట్లు గానే మిగిలిపోయాయి. తర్వాత కార్తికేయ నుండి వచ్చిన ‘హిప్పీ’ ’90 ఎం ఎల్’ ‘గుణ 369’ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్లో చేసిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా కలిసి రాలేదు. ఇక ఆ తర్వాత చేసిన ‘రాజా విక్రమార్క’ పరిస్థితి కూడా అంతే. విలన్ గా ప్రయత్నించిన ‘నానీ గ్యాంగ్ లీడర్’ ‘వాలిమై’ సినిమాలు కార్తికేయకు గుర్తింపు తీసుకురాలేదు. కార్తికేయ చివరి సినిమా వాలిమై. ఈ సినిమా రిలీజ్ అయ్యి 5 నెలలు కావస్తున్నా, మరో సినిమా ప్రారంభం కాలేదు. దీంతో కార్తికేయ సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడా లేదా, గుడ్ బై చెప్పాడా అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిజానికి కార్తికేయతో సినిమాలు చేయడానికి చాలా మంది నిర్మాతలు రెడీగా ఉన్నారు అని వినికిడి. అయినా, కార్తికేయ ఎందుకు సినిమాలు చేయడం లేదని ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు