Akkineni Family: తమిళ దర్శకులను నమ్ముతున్నారా ?

తెలుగు చిత్ర పరిశ్రమపై అక్కినేని ఫ్యామిలీ డామినేషన్ ఎక్కువగా ఉండేది. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున ఓ టైంలో టాలీవుడ్ ను షేక్ చేశారు. అయితే ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ ట్రబుల్ అవుతుంది. ఈ ఫ్యామిలీ నుంచి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. నాగార్జున నుంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. ఇటీవల బంగార్రాజు కొంత వరకు బ్రేక్ ఇచ్చినా, నాగ్ నుంచి దానికి మించి ఆశించవచ్చు.

అయితే నాగ చైతన్య మాత్రం టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వరుసగా సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్నాడు. మంచి ఫాం లో ఉన్న చైతన్య ఇటీవల థాంక్యూ తో నిరాశపరిచాడు. బాలీవుడ్ లో మొదటి సినిమా లాల్ సింగ్ చడ్డా కూడా పెద్దగా ఆడలేదు. కానీ చైతన్య నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అఖిల్ అయితే ఇంత వరకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంత వరకు పాజిటివ్ తెచ్చుకుంది. కానీ, సూపర్ హిట్ అయితే కాలేదు. దీంతో అక్కినేని ఫ్యామిలీ రాబోయే సంవత్సరమైన టాలీవుడ్ ను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.

అందుకు అక్కినేని ఫ్యామిలీ మొత్తం తమిళ దర్శకులపై ఆధారపడుతుంది. నాగార్జున తన కెరీర్ లో 100వ సినిమాను మోహన్ రాజా తో సెట్ చేస్తున్నాడు. దీనిపై నాగ్ ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాడు. నాగ చైతన్య కూడా ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో NC22 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. ఇటీవల ఈ సినిమాలో నటించే వాళ్ల పేర్లను కూడా అనౌన్స్ చేశారు. కోలీవుట్ స్టార్ నటుడు అరవింద్ స్వామి, ప్రియమణి, సంపత్ రాజ్ తో పాటు కార్తీక దీపం సీరియల్ ఫేం ప్రేమి విశ్వనాథ్ ఇందులో ఉన్నారు.

- Advertisement -

అలాగే ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్న అఖిల్, తన తర్వాత సినిమాను ఓ తమిళ దర్శకుని చేతిలో పెట్టడానికి రెడీ అవుతున్నాడట. ఇప్పటికే స్టోరీ చర్చలు జరుగుతున్నాయని సమాచారం. స్టోరీ ఫైనల్ అయితే అఖిల్, తమిళ దర్శకుడి కాంబోలో సినిమా వస్తుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.

మొత్తం ఫ్యామిలీ మొత్తం తమ సినిమాలు తమిళ దర్శకుల చేతిలో పెట్టి తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు సఫలమవుతుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు