Drishyam2 : బాలీవుడ్ కి భరోసా

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వచ్చే సినిమాలన్నీ వరుసగా బోల్తాకొడుతున్నాయి ఇటువంటి తరుణంలో అజయ్ దేవగన్ నటించిన “దృశ్యం” సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించి ముందుకు సాగుతుంది.
‘దృశ్యం’ సినిమా అన్ని భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. వాస్తవానికి మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు అన్ని ప్రముఖ భాషలలో రీమేక్ చేయబడింది, హిందీలో దీనిని అజయ్ దేవగన్, శ్రేయ మరియు టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఒరిజినల్ సీక్వెన్స్ ‘దృశ్యం 2’కి రీమేక్ కూడా ఇటీవలే విడుదలైంది.

గత వారాంతంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడంతోపాటు మంచి ఆదరణను కూడా అందుకుంది.
‘థ్యాంక్ గాడ్’ వంటి పరాజయం తర్వాత, అజయ్ కు దృశ్యం సినిమాతో మంచి హిట్ పడింది. ఈ చిత్రం విడుదలైన ఒక వారంలోనే ₹ 100CR క్లబ్‌లో చేరింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘దృశ్యం 2’ 7వ రోజున ₹ 8.50 – ₹ 9.20 CR వసూలు చేసింది మరియు మొత్తం కలెక్షన్స్ ₹ 104.54CR – ₹ 105.24 CR మధ్య ఉన్నాయి. హిందీ బాక్సాఫీస్ ట్రెండ్ ప్రకారం, ఇది ఈ సంవత్సరం బాలీవుడ్‌లో ఒరిజినల్ బిగ్గెస్ట్ హిట్ అవుతుంది మరియు ఈ చిత్రం వరుణ్ ధావన్ యొక్క భేదియాతో పోటీపడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు