Vijay Devarakonda : ఇది సైడ్ ఎఫెక్ట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో గా ఎదిగాడు. ఈయన హీరోగా చేసిన మొదటి చిత్రం పెళ్లి చూపులు, తర్వాత అర్జున్ రెడ్డి కెరీర్ కు మంచి మైలేజ్ ఇచ్చాయి. ఈ రెండు సినిమాలతో యూత్ ను తనవైపునకు తిప్పుకున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించాడు. అలా కొన్ని రోజుల్లోనే స్టార్ హీరో అయ్యాడు. అక్కడి నుంచి పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలని పూరి జగన్నాథ్ తో లైగర్ చేశాడు.

భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. అయితే ప్రస్తుతం లైగర్ సినిమపై పెట్టుబడుల వ్యవహారంపై నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మీలను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం రౌడీ హీరో విజయ్ దేవరకొండను కూడా ఈడీ విచారించింది. విజయ్ ను ఈడీ దాదాపు 11 గంటలపాటు లైగర్ లవాదేవీలు, రెమ్యునరేషన్ లకు సంబంధించిన ప్రశ్నలను వేసిందని తెలుస్తుంది. లైగర్ కు మీ రెమ్యునరేషన్ ఎంత ? మైక్ టైసన్ కు ఎంత ఇచ్చారు ? లైగర్ కు ఇంక ఎవరైనా పెట్టుబడులు పెట్టారా ? అంటూ ప్రశ్నించారని సమాచారం.

ఇది ఇలా ఉండగా బుధవారం ఈడీ విచారణ తర్వాత విజయ్ మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణకు తాను సహాకరించానని, తనను మళ్లీ విచారణకు పిలవలేదని చెప్పారు. అభిమానులు చూపించే ప్రేమ వేల కట్టలేదని అన్నారు. అయితే ఈ ప్రేమతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, అలాంటిదే ఈ విచారణ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు