సాధారణంగా సినిమాలు చేసే కొంతమంది ప్రేమలో పడడం మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. ఆ తరువాత కొంత కాలానికే చాలా జంటలు విడిపోతున్న విషయం విధితమే. కొద్ది మంది మాత్రమే తమ ఏర్పడిన మనస్పార్థాలకు కారణాలు వాటికి పరిష్కారం కనుకొని కలిసి ఉంటున్నారు. ఎందుకు రాజీ పడాలనుకునేవారు అహం, అసూయలతో రగిలిపోతూ చివరికీ విడిపోతూ ఉన్నారు. అలాంటి జంటల్లో సింగర్ నోయెల్, హీరోయిన్ ఎస్తేర్ జంట ఒకటి.
వీరు పెళ్లి అయిన ఆరు నెలలకే విడిపోయారు. వీరిది పెద్దలు కుదిర్చిన పెళ్లినే. కానీ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో ఎవరి దారి వాళ్లు చూసుకుని విడివిడిగా ఉంటున్నారు. సింగర్ నోయెల్ తన సింగింగ్ వృత్తిలో బిజీగా ఉంటే.. ఎస్తేర్ వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తోంది. రీసెంట్ గా ’69 సంస్కార్ కాలనీ’ అనే మూవీలో నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. నోయెల్ పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తనపై నెగిటివ్ ప్రచారం చేశాడని ఆరోపించింది. విడాకుల తరువాత బిగ్ బాస్ షోకి వెళ్లిన నోయెల్ ఆ ఇష్యూని సానుభూతి కోసం వాడుకున్నాడని కామెంట్ చేసింది.
ముఖ్యంగా తనను అన్ని రకాలుగా వాడుకొని బ్యాడ్ చేశాడంటూ నోయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను బ్యాడ్ చేయడంతో తనపై ట్రోల్స్ ఎక్కువయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బంగారం లాంటి నోయెల్ ని వదిలేసి ఎలా వెళ్లిపోయావ్ అనేవిధంగా తన మీద సింపతి క్రియేట్ చేసుకున్నాడని నోయెల్ పై విమర్శలు చేసింది. వీటన్నింటికీ సమాధానం చెప్పాలంటే మూడేళ్ల తరువాత మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతానని ఆమె వెల్లడించింది. పెళ్లి జరిగిన తరువాత 6 నెలలకే విడాకులు తీసుకున్నామని.. కానీ తాము కలిసి ఉన్నది కేవలం 16 రోజులు మాత్రమేనని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది ఎస్తెర్.