Faria Abdullah : గ్యాప్ అందుకే

ఒక సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది ఫరియా అబ్దుల్లా. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో, కమెడియన్లతో సమానంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా కామెడీని పండించింది. కోర్ట్ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. అలాగే తన అందాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రంలోని చిట్టి సాంగ్ ఇప్పటికే అందరి నోట వినిపిస్తుంది.

అయితే జాతి రత్నాలు తర్వాత ఫరియా అబ్దుల్లా పెద్దగా కనిపించలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్ర చేసిన చిట్టి, బంగర్రాజు చిత్రంలో వాసివాడి తస్సాదియ్యా.. అంటూ ఒక స్పెషల్ సాంగ్ చేసింది. కానీ, హీరోయిన్ గా మాత్రం చేయలేదు. తాజాగా లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనే చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా, సంతోష్ శోభన్ హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా, తన గ్యాప్ గురించి ఫరియా కీలక వ్యాఖ్యలు చేసింది.

“జాతి రాత్నాలు తర్వాత నేనే కావాలని కొంత గ్యాప్ తీసుకున్నాను. అలాగే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునే సమయంలో నాక్ గట్ ఫీలింగ్ రావాలి. అప్పుడే ఆ సినిమా చేస్తా. అలాంటి ఫీలింగ్ నాకు రాలేదు. కానీ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ స్క్రిప్ట్ విన్న తర్వాత ఆ ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈ చిత్రం చేస్తున్నా. చిత్ర షూటింగ్ టైంలోచాలా ఎంజాయ్ చేశా. ఈ చిత్రం ఒక అడ్వెంచర్ గా అనిపించింది” అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు