Shaakuntalam : ఫైనల్ గా రిలీజ్ డేట్ వచ్చేసింది

ఇటీవల యశోద సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేసిన టాలెంటెడ్ బ్యూటీ సమంత.. ప్రస్తుతం శాకుంతలం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ మైథాలజికల్ డ్రామా చిత్రం తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు 2020 అక్టోబర్ లో ప్రకటించినప్పటికీ.. పాండమిక్ తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

ఇక షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినప్పటికీ 3D వెర్షన్ కోసం జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించింది మూవీ యూనిట్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2023 ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానుంది. దేవ్ మోహన్, మోహన్ బాబు, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. శకుంతల, దుష్యంత మహారాజుల మధ్య ఉన్న అజరామరమైన ప్రయాణ గాథ నేపద్యంలో ఈ సినిమా సాగుతుంది. శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ నటించారు.

- Advertisement -

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నీలిమ గుణ, దిల్ రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్ర మాటలు రాశారు. “శాకుంతలం వీక్షించండి.. 3d వెర్షన్ లో సైతం” అంటూ సమంత, దేవ్ మోహన్ రొమాంటిక్ పిక్ తో కూడిన రిలీజ్ పోస్టర్ ను పోస్ట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు