GopiChand Malineni: పవన్ కళ్యాణ్ సినిమా వదులుకున్న

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇప్పుడు తన దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం సంక్రాంతికి జనవరి 12న విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

సినిమా విజయవంతమైన సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్నాడు అందులో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో ఇండస్ట్రీలో తన అనుభవాలను పంచుకున్నాడు. క్రాక్ సినిమా హిట్ తరవాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకి దర్శకత్వం వహించాల్సి ఉందని చెప్పాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించమని తనను అడిగారని, అయితే అది కొన్ని కారణాలు వలన పట్టాలెక్కలేదని చెప్పుకొచ్చాడు.

అలానే గోపీచంద్ మలినేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు మరియు దానికి తగ్గట్టుగానే కథను సిద్ధం చేసుకున్నట్లు తెలిపాడు. తాను పవర్ స్టార్‌కి వీరాభిమానిని అని కూడా పంచుకున్నాడు. కరోనా సమయంలో బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ కోసం అతను రెండు కథలను సిద్ధం చేసినట్లు తెలిపాడు.

- Advertisement -

ఇకపోతే సంక్రాంతి బరిలో గోపి చంద్ మలినేని, బాబీ తమ సినిమాలతో నిలబడ్డారు. భారీ బ్లాక్‌బస్టర్‌లతో యువ దర్శకులిద్దరూ తమ సత్తా చాటుకున్నారు. బాబీ దర్శకత్వం వహించిన చిరు వాల్తేరు వీరయ్య మరియు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన బాలయ్య వీరసింహా రెడ్డి చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించడం విశేషం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు