Goutham Raju: ప్రముఖ సినీ ఎడిటర్‌ మృతి

గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు మంగళవారం అర్థరాత్రి హైదాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దాదాపు 800కిపైగా సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌సింగ్‌, కిక్‌, రేసుగుర్రం, గోపాల గోపాల, అదుర్స్‌, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, బద్రీనాథ్‌ సినిమాలకు గౌతమ్‌రాజు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ అనేక సినిమాలకు ఆయన పనిచేశారు.

ఈ వార్త తో తీవ్ర దిగ్బ్రాంతి కి లోనైన సినీపరిశ్రమ ప్రముఖులు ప్రగాఢ సానుభూతుని తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి
సోషల్‌ మీడియా వేదికగా ‘ గౌతమ్‌ రాజు లాంటి గొప్ప ఎడిటర్‌ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన ఎంత సౌమ్యుడో.. ఆయన ఎడిటింగ్‌ అంత వాడి. ఆయన మితభాషి, కానీ ఆయన ఎడిటింగ్‌ మెళకువలు అపరిమితం. ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్‌ అలంత వేగం. ‘చట్టానికి కళ్లు లేవు’ చిత్రం నుంచి ‘ఖైదీ నం.150’ వరకు నా ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన గౌతమ్‌ రాజు గారు లేకపోవటం వ్యక్తిగతంగా నాకూ, మొత్తం సినీ పరిశ్రమకు పెద్ద లోటు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు