ప్రస్తుతం పవన్ కళ్యాణ్, వరుస సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. ఈ మధ్య భీమ్లా నాయక్ తో హిట్ అందుకున్న పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. క్రిష్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఎం రత్నం నిర్మాత. గతంలో ఏఎం రత్నం, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఖుషి, బంగారం వంటి చిత్రాలు వచ్చాయి.
ఖుషి ఎవర్ గ్రీన్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బంగారం మాత్రం యావరేజ్ అనిపించుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు సెట్ అయినా కాంబో కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇది పీరియడిక్ డ్రామాగా రూపొందుతున్న సినిమా. ఔరంగజేబ్ కాలంలో సాగే కథ. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.
నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇప్పటికే చిత్ర యూనిట్ బాలీవుడ్ నుంచి పలువురు స్టార్లను తీసుకోగా, తాజాగా మరో సీనియర్ హీరోను ఎంచుకుంది. అది ఎవరో కాదు.. బాలీవుడ్ కు చెందిన బాబీ డియోల్.
తాజాగా ఈ సినిమాలో బాబీ డియోల్ భాగం కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమాలో ఔరంగజేబు పాత్రను బాబీ డియోల్ చేయనున్నారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో ఆయన ఎంతో ఎనర్జీగా, బలంగా సెట్స్ లోకి అడుగు పెట్టినట్లు చూపించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కు చెందిన బాబీ డియోల్… ఓ రాజు పాత్ర చేస్తున్నారని టాక్.
Delighted and excited to welcome actor par excellence and big action stars of Indian Cinema @thedeol into our mighty #HariHaraVeeraMallu. Embrace for an exciting ride 🌟🌟https://t.co/O0IpIHQmix@PawanKalyan @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @HHVMFilm
— Krish Jagarlamudi (@DirKrish) December 24, 2022