Indain LockDown : టీజర్ అవుట్

కోవిడ్ 19.. ఈ మహమ్మారి సృష్టించిన మారణ హోమం అంతా ఇంతా కాదు. ఈ పేరు వినబడితేనే యావత్ ప్రపంచం వనికిపోయిన రోజులు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలలో తీరని శ్లోకాన్ని మిగిల్చింది ఈ కరోనా మహమ్మారి. అయితే కరోనా సమయంలోని కఠిన పరిస్థితులను ఆధారంగా చేసుకుని దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కించిన చిత్రం “ఇండియన్ లాక్ డౌన్”.

ఈ చిత్రంలో శ్వేతా బసు ప్రసాద్, ప్రతీక్ బబ్బర్, సాయి తమంకర్, ప్రకాష్ బెలవాడి తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వలస కూలీలు అనుభవించిన వేదన ఏంటి? వేశ్యవృత్తి వారిపై కరోనా ప్రభావం ఎలా పడింది? అనే పలు ఆసక్తికర సన్నివేశాలను ఈ చిత్రంలో మధుర్ బండార్కర్ చూపించనున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ఓటీటీ జి 5 వేదికగా డిసెంబర్ 2 వ తేదీన స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో ” ఇండియన్ లాక్ డౌన్” యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. కరోనా నాటి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేర ఆదరిస్తారో వేచి చూడాలి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు