Itlu Maredumilli Prajaneekam : ట్రైలర్ కు ముహూర్తం

నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాదు నటుడిగా నరేష్ కు చాలా మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది. ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. కాగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ను వైవిధ్యంగా ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. మొదట ఈ చిత్ర ట్రైలర్ ను నవంబర్ 11న కేవలం థియేటర్లలో ఎక్స క్లూజివ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఇక ఆ తర్వాత డిజిటల్ రిలీజ్ ను నవంబర్ 12న చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను దర్శకుడు ఏ ఆర్ మోహన్ డైరెక్ట్ చేస్తుండగా, జి స్టూడియోస్, హాస్యం మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు