Allari Naresh : విడుదలయ్యేనా ?

టాలీవుడ్ న‌టుడు అల్ల‌రి న‌రేష్ క‌థానాయ‌కుడిగా ఏ.ఆర్‌. మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం “ఇట్లు మారెడుప‌ల్లి ప్ర‌జానీకం”. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.

ముఖ్యంగా టీజర్ లో అల్లరి న‌రేష్ మారేడుమిల్లిలో ఎన్నిక‌ల విధుల‌ను నిర్వ‌హించే ప్ర‌భుత్వ అధికారి పాత్రలో క‌నిపించాడు. అల్లరి నరేష్ తొలిసారి ఇలాంటి పాత్రలో కనిపించడం విశేషం. గ‌తంలో ఈ సినిమాప్ర‌పంచ వ్యాప్తంగా న‌వంబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అందుకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఈ చిత్రం తెర‌కెక్కించ‌డంలో కొంచెం ఆల‌స్యం కావ‌డంతో తాజాగా కొత్త డేట్‌ను లాక్ చేశారు చిత్ర బృందం.

“ఇట్లు మారెడుప‌ల్లి ప్ర‌జానీకం” న‌వంబ‌ర్ 11 నుంచి న‌వంబ‌ర్ 25 కి షిప్ట్ చేశారు. న‌వంబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంద‌ని ఓ ఆసక్తిక‌ర‌మైన పోస్ట్‌ను విడుద‌ల చేశారు. మొత్తానికి కొత్త థియేట్రిక‌ల్ డేట్‌ని అనౌన్స్ చేశారు. నవంబ‌ర్ 25న అయినా అల్ల‌రి న‌రేష్ చిత్రం విడుద‌ల‌వుతుందో లేదో వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు