Avatar : 4K ట్రెండ్

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల పుట్టిన రోజు సందర్భంగా గతంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. 4K ప్రింట్ ను రెడీ చేసి మరీ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఒకడు, పోకిరి సినిమాలను రీ రిలీజ్ చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఘరానా మొగుడు ను మళ్లీ విడుదల చేశారు. ఈ మూడు సినిమాలు కూడా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న త్రివిక్రమ్-పవన్ కాంబో లో వచ్చిన జల్సాను రీ రిలీజ్ చేయనున్నారు.

రీ రిలీజ్ ట్రెండ్ ఒక టాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లోనూ నడుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా మళ్లీ ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఆ సినిమా ఏంటంటే.. అవతార్. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ సినిమా 2009 లో విడుదలైంది. దీనికి సీక్వెల్ లో భాగంగా పార్ట్ 4 వరకు సినిమాలు ఉంటాయని జేమ్స్ కేమరూన్ ఇప్పటికే ప్రకటించాడు. అందులో భాగంగా అవతార్ 2 విడుదలకు సిద్ధమవుతుంది. ఈ ఏడాదిలో డిసెంబర్ 16న విడుదల కానుంది.

అయితే దీనికి ముందు అవతార్ పార్ట్ 1ను రీ రిలీజ్ చేస్తున్నట్టు డైరెక్టర్ జేమ్స్ కేమరూన్ అధికారికంగా ప్రకటించాడు. 4K లో అవతార్ సినిమాను సెప్టెంబర్ 23న మళ్లీ విడుదల చేయనున్నారు. కాగా, అవతార్ పార్ట్ 1 ఇప్పటికే 2010 ఒక సారి రీ రిలీజ్ చేశారు. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 265 కోట్లను వసూళ్లు చేసింది. మరీ రెండో సారి రీ రిలీజ్ అవుతున్న అవతార్.. ఎంత కలెక్షన్లు చేస్తుందో చూడాలి మరి.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు