జేమ్స్ కామెరూన్.. సినీ ప్రపంచానికి తన క్రియేషన్స్ తో కొత్త అనుభూతినిచ్చిన హాలీవుడ్ డైరెక్టర్. తొలుత టైటానిక్ చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ తరువాత ఆయన చేసిన ప్రతీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వీక్షించారు. 2012లో వచ్చిన అవతార్ చిత్రం ఒక అద్భుతమే సృష్టించింది. దానికి సీక్వెల్గా జేమ్స్ అవతార్ 2 అనే పేరుతో మరో విజువల్ వండర్ ని క్రియేట్ చేశారు. దీనిని వీక్షించాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇటీవల విడుదలైన ట్రైలర్తోనే రుచి చూపించారు కామెరూన్.
తాజాగా అవతార్ సీక్వెల్ పై డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటికే అవతార్ 2, 3 కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయిందట. అవతార్ 2 విజయం సాధించకపోతే అవతార్ 4, 5 సిరిస్లను చేయను అని చెప్పుకొచ్చాడు. ఇది సంచలన నిర్ణయం అయినప్పటికీ కొన్ని పరిస్థితుల్లో తప్పదని వెల్లడించారు కామెరూన్. అవతార్ 2 డిసెంబర్ 16, 2022, అవతార్ 3 డిసెంబర్ 24, 2024, అవతార్ 4 డిసెంబర్ 18, 2026, అవతార్ 5 డిసెంబర్ 22, 2028న విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించారు. కానీ తాజా వ్యాఖ్యలతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
అవతార్ 2 కి సంబంధించిన ట్రైలర్ కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దర్శకుడు కామెరూన్ చూపించిన అందాలను, అద్భుతాలను చూసి సినీ అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా సముద్ర గర్భంలో వచ్చే సీన్లు అద్భుతంగా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ సన్నివేశాల కోసం కామెరూన్ అత్యాధునిక టెక్నాలజీని వాడారట. అవతార్ 2 చిత్రాన్ని దాదాపు 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించారు.