Janhvi Kapoor : టాలీవుడ్ లో ఆ ఇద్దరితో నటించాలని ఉంది

బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. దివంగత నటి శ్రీ దేవి వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిన ఈ సుందరి, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా, సోషల్ మీడియా ద్వారా ఈమె విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ ఏడాది గుడ్ లక్ జర్రీ, మిలి వంటి సినిమాల్లో నటించింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు.

ప్రస్తుతం ఈమె బావాల్, మిస్టర్ & మిసెస్ మహి అనే సినిమాల్లో నటిస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీకి సౌత్ సినిమాల్లో నటించాలనే కోరిక చాలా బలంగా ఉంది. సమయం ప్రతి సారి సౌత్ సినిమాలపై, హీరోలపై తన ఇష్టాన్ని బహరింగంగానే చెబుతుంది. తాజాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు జూనియర్ ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఆయన వెరీ టాలెంటెడ్, చార్మింగ్ యాక్టర్‌గా పేర్కొంది. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తారక్ యాక్టింగ్ గురించి తెలుసుకునేందుకు జనతా గ్యారేజ్‌ చూసినట్లు వెల్లడించింది.

అలాగే సౌత్‌లో ఎవరితో కలిసి పనిచేయాలని ఉందనే ప్రశ్న రాగా.. దానికి సమాధానంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు చెప్పింది. అంతేకాదు జనతా గ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివ, పుష్ప డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కూడా చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తనకు హైదరాబాద్ ఫుడ్ అంటే కూడా చాలా ఇష్టమని చెప్పింది. హైదరాబాద్‌‌కు వచ్చినపుడు మొహం కనిపించకుండా కవర్ చేసుకుని చోర్ బజార్‌‌లో కబాబ్స్, బిర్యానీ టేస్ట్ చేసినట్లు వెల్లడించింది. తెలుగు మాట్లాడే వారితో మాట్లాడిప్పుడు వారతో ఈజీ ఫ్రెండ్‌ అయిపోతానని వివరించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు