Janhvi Kapoor : టాబ్లెట్లు వాడుతున్నా..

అతిలోక సుందరి, లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చేసింది తక్కువ సినిమాలే అయినా, ప్రతి రోజు ఎదో ఒక న్యూస్ తో ట్రెండింగ్ లో ఉంటుంది. “ధడక్” అనే చిత్రంతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వి.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. ఈ భామ నటించిన తాజా చిత్రం “మిలీ”. మలయాళ చిత్రం “హెలెన్” కు ఈ మూవీ రీమేక్. నవంబర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వి కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ మూవీలోని పాత్ర కోసం తాను 7.5 కేజీల బరువు పెరిగానని చెప్పుకొచ్చింది. అంతేకాక ఈ సినిమా విషయంలో తాను శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డట్లు తెలిపింది. ఈ సినిమాలో తాను పోషించిన పాత్రకు సంబంధించిన దృశ్యాలు తన కలలోకి వచ్చేవని.. దాంతో సరిగా నిద్ర కూడా పట్టకపోవడంతో తన ఆరోగ్యం దెబ్బతిన్నట్లు పేర్కొంది. ఈ కారణంగా పెయిన్ కిల్లర్స్ కూడా వాడినట్లు చెప్పుకొచ్చింది.

అంతేకాక తాను సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రావడం వల్ల నిత్యం విమర్శలు చేస్తుంటారని.. వాటి వల్ల కూడా మానసికంగా డిస్టర్బ్ అవుతున్నానని చెప్పింది. తనకి బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టే అవకాశాలు వస్తున్నాయని మాటలు విన్నప్పుడల్లా బాధగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. విమర్శకులకు సమాధానం చెప్పాలనే కసితో కష్టపడి పని చేస్తున్నట్లు తెలిపింది జాన్వి కపూర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు