Janhvi Kapoor : అన్ని కుదిరితే త్వరలోనే

అలనాటి తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలే అయినప్ప‌టికీ ఈమెకు క్రేజ్ భారీ స్థాయిలో ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ సూపర్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే  మంచి పేరు సంపాదించుకుంది. ఈమె తాజాగా చేస్తున్న చిత్రం మిలి. మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నాడు. హెలెన్ అనే మలయాళ చిత్రానికి అధికారిక రీమేక్ గా ‘మిలి’ వస్తుంది.

ప్రీజర్ లో ఇరుక్కుపోయిన ఒక యువతి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఏం చేసింది. ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది. చివరికి బతికిందా అనే నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఈ చిత్రం ప్రమోషన్ల కోసం జాన్వీ కపూర్ హైదారాబాద్ కు వచ్చింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ”సౌత్ ప్రేక్షకులు మా అమ్మ శ్రీ దేవీపై, నాన్న బోనీ కపూర్ ను ఎంతో ప్రేమించారో అందరికీ తెలుసు. ఆ ప్రేమతోనే నేను ఇక్కడకు వచ్చాను. త్వరలోనే సౌత్ లో సినిమా కూడా చేయబోతున్నాను. అన్నీ కుదిరితే అది త్వరలోనే జరగవచ్చు” అని చెప్పుకొచ్చింది.

అలాగే ‘మిలి’ సినిమా గురించి గురించి చెబూతూ.. ”మిలి స్టోరీని డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందని అనిపించింది. మైనస్ 18 డిగ్రీల వద్ద నటించడం ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది. నాన్న తో చేస్తున్న తొలి చిత్రం మిలి” అంటూ జాన్వీ కపూర్ వెల్ల‌డించింది.

- Advertisement -

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు