Kangana Raunath: పార్లమెంటుకు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటే అందరికీ వినిపించే పేరు కంగనా రౌనత్. ఏదో ఒక విషయంతో ప్రతి రోజు వార్తల్లో ఉంటుంది ఈ భామ. అప్పుడప్పుడు సెలబ్రెటీలపై, రాజకీయ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తోంది. అయితే ఈమె కెరీర్ తొలినాళ్లలో హిందీలో చాలా సినిమాలు చేసింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమా చేసిన తర్వాత హీరోయిన్ గా మంచి పేరు వచ్చింది.

తెలుగులో గుర్తింపు వచ్చినా ఈ ఫైర్ బ్రాండ్ బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అక్కడ ఈమెకు వరుసగా అవకాశాలు కూడా వచ్చాయి. గతంలో కంగనా రౌనత్ మంచి సినిమాల్లోనే నటించింది. కానీ ప్రస్తుతం వివాదస్పదమయ్యే సినిమాలనే చేస్తూ వస్తుంది. అలాంటి సినిమాలపై విమర్శలు వచ్చినా, ట్రోల్స్ వచ్చినా, కలెక్షన్లు తక్కువ వచ్చినా ఈ ఫైర్ బ్రాండ్ వెనక్కి తగ్గడం లేదు. తాజాగా కంగనా రౌనత్ మరో వివాదస్పద మైన స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధపడుతున్న సంగతి విధితమే.

భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ జీవిత కథ ఆధారంగా మూవీని తెరకెక్కిస్తోంది. దీనికి ఎమర్జెన్సీ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి స్వయంగా కంగనా రౌనత్ దర్శకత్వం వహిస్తూ, ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ కోసం పార్లమెంట్ సెట్ కావాల్సి ఉంటుందట. అందుకోసం పార్లమెంట్ షూటింగ్ కు అనుమతి ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరిందట. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. కాగా పార్లమెంటులో బయట వ్యక్తులకు, షూటింగ్ లకు అనుమతి లేదు. దీంతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కు అనుమతి లభించడం కష్టమే అని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు