Prashanth Neel : కేజీఎఫ్ 3 షూటింగ్ వాయిదా

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసింది మూడు సినిమాలే అయినా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. రాకింగ్ స్టార్ యష్ హీరో గా వచ్చిన కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రశాంత్ నీల్ సోమవారం అధికారికంగా ప్రకటించిన సంగతి విధితమే. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసి, అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30 పనుల్లో ఉన్నారు. ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో.. ప్రశాంత్ నీల్ తో వచ్చే సినిమా ఎప్పుడు వస్తుందో అని నందమూరి ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. తాజా గా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 గురించి సోమవారం ఓ అప్ డేట్ ఇచ్చారు. సలార్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన తర్వాత ప్రశాంత్ నీల్ ప్రెస్ తో మాట్లాడారు.

ఈ సందర్భంగా విలేకర్లు ఎన్టీఆర్ 31 గురించి ప్రశాంత్ నీల్ ను అడిగగా.. ఎన్టీఆర్ 31 షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ లో గానీ, మేలో గాని ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. అంటే సలార్ షూటింగ్ పూర్తి అయిన తర్వాతే ఎన్టీఆర్ 31 షూటింగ్ ప్రారంభం అవుతుంది. దీన్ని బట్టి కేజీఎఫ్ 3 చిత్రం ఎన్టీఆర్ 31 తర్వాతే స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. దీనిపై కేజీఎఫ్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. ముందుగా సలార్ తర్వాతే కేజీఎఫ్ 3 ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ 31 ముందు వస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు