Kriti Sanon : హద్దులు దాటకుండా నటించా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకుడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆది పురుష్. డార్లింగ్ ప్రభాస్ రాముడి పాత్రలో, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ హీరోయిన్ గా వస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. దీనికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది.

కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ లో నాణ్యత లేదంటూ ఫ్యాన్స్ ను వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో మరింత మెరుగ్గా వీఎఫ్ఎక్స్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది. అందువల్లే ఈ చిత్రం వాయిదా పడింది. దీంతో సినిమాపై రోజు రోజుకు అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. రాముడి పాత్రలో ప్రభాస్ ఎలా చూపించారు? సీత పాత్రలో కృతి సనన్ సెట్ అయిందా అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఆది పరుష్ చిత్రంలో సీత పాత్ర చేసిన కృతి సనన్.. తాజాగా ఓ సందర్భంలో తన పాత్ర గురించి స్పందించింది.

ఆది పురుష్ సినిమాలో జానకి పాత్రను పోషించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని కృతి సనన్ చెప్పింది. సీత పాత్ర చేయడం జీవితకాల అనుభవమని ఆనందం వ్యక్తం చేసింది. హృదయం నిండా భక్తిభావం, ప్రేమను నింపుకొని ఈ పాత్రలో పరిపూర్ణత కనబరిచే ప్రయత్నం చేశానని కృతి సనన్ చెప్పుకొచ్చింది.

- Advertisement -

అలాగే “ఈ కథ గురించి విన్నప్పుడు సీత పవిత్ర హృదయం, శ్రీరాముడి పట్ల జానకి కి ఉన్న ఆరాధనా భావం ఎంతగానో కదిలించాయి. సీత లాంటి ఆదర్శప్రాయురాలైన మహిళ పాత్రను పోషించే విషయంలో చాలా పరిమితులుంటాయి. అందులో భాగంగా సీత పాత్ర చేసే సమయంలో నేను ఎక్కడా హద్దులు దాటకుండా.. గొప్ప బాధ్యతతో పాత్రకు న్యాయం చేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు