సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల కు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉండటం, వారికి సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజీస్ ఉండటం సహాజం. ఇందులో హీరోలు తమ ఫ్యాన్స్ ను అప్పుడప్పుడు కలుస్తూ.. ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. వారితో కొంత సమయాన్ని గడుపుతారు. దీన్ని ఫ్యాన్ మీట్ అంటారు. ఇలా ఫ్యాన్స్ మీట్ ను చాలా మంది హీరోలు నిర్వహిస్తారు. హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉన్నా.. ఫ్యాన్ పేజీలు ఉన్నా.. ఫ్యాన్స్ మీట్ మాత్రం ఎప్పుడు జరగలేదు.
తాజాగా ఉప్పెన సినిమాతో కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన బేబమ్మ దీనికి బ్రేక్ వేసి సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఉప్పెనతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి, వరుసగా బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ సినిమాలను అందుకుంది. దీని తర్వాత మూడు ఫ్లాపులు వచ్చినా, బేబమ్మ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అంతే కాదు.. రోజు రోజుకు ఈమె అందానికి ఫ్యాన్స్ కూడా పెరిగిపోతున్నారు. తాజాగా కృతి శెట్టి చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే ? ఫ్యాన్స్ మీట్.
సాధారణంగా ఫ్యాన్స్ మీట్ అంటే హీరోలే జరుపుతారు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫ్యాన్స్ మీట్ ఇప్పటి వరకు జరగలేదు. కానీ, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన బేబమ్మ.. హైదరాబాద్ లో తన అభిమానులను సీక్రెట్ గా కలిసింది. అంతే కాదు.. వారితో ఫోటోలకు ఫోజ్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అలాగే ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఫ్యాన్స్ మీట్ చేయడం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ భామకు సినిమాల్లో నటించడమే కాదు.. అభినులను ఆకట్టుకోవడం కూడా తెలుసు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News
View this post on Instagram