Maheshbabu: స్టార్ డైరెక్టర్ ను రిజెక్ట్ చేసిన మహేష్

కొన్ని సార్లు కొందరు హీరోస్ కొన్ని ప్రాజెక్ట్స్ ను వదులుకోవడం సహజం దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అప్పట్లో పూరీజగన్నాధ్ రాసిన ప్రతి కథను పవన్ కళ్యాణ్ కి వినిపించేవారట. కానీ పవన్ కళ్యణ్ ఎక్కువ శాతం రీమేక్ సినిమాలకే ప్రాముఖ్యతను ఇచ్చేవారు. చాలామంది యంగ్ హీరోస్ చాలా ప్రాజెక్ట్స్ ను వదులుకుంటారు. వదులుకున్న ప్రాజెక్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పుడు అరేయ్ అనవసరంగా రిజక్ట్ చేసేమే అని చేతులు పిసికేసుకుంటారు. సందీప్ రెడ్డి వంగ చేసిన అర్జున్ రెడ్డి సినిమా ముందు శర్వానంద్ హీరోగా, స్వప్న దత్ నిర్మాతగా అనుకున్నారు కానీ అది ఏందుకో జరగలేదు.

ప్రస్తుతం అదే తరహాలో వ్యవహరిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
మహేష్ బాబు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోస్ లో ఒకరు,
ఇప్పటివరకు తనతో వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరి దగ్గర మహేష్ కి మంచి పేరు ఉంది. మహేష్ ను డైరెక్టర్స్ హీరో అంటారు తనతో వర్క్ చేసిన డైరెక్టర్స్ కొంతమంది.ఒకసారి డైరెక్టర్స్ చెప్పిన తరువాత అతనికి ఏదైనా చేసేయడం అలవాటు. ఒక కథను వినగానే క్షణంలో నిర్ణయం తీసుకుని చెప్పేయడం కూడా మహేష్ కి అలవాటు.
మహేష్ కొన్ని ప్రాజెక్ట్స్ ను అనౌన్స్ చేసి కూడా సినిమా చేయకుండా వెనక్కు తగ్గిన సందర్బాలు ఉన్నాయ్, అందులో సుకుమార్ తో చెయ్యాల్సిన సినిమా ఒకటి , పూరి తో చెయ్యాల్సిన జనగణమన సినిమా కూడా ఒకటి.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే..
నగరం సినిమాతో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, ఇళయదళపతి విజయ్ , మక్కల్ సెల్వన్ తో మాస్టర్ సినిమా చేసారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ మహేష్ కి కథను వినిపించారట మహేష్ కి ఈ కథ నచ్చక రిజక్ట్ చేశారట. అయితే లోకేష్ చేసిన విక్రమ్ సినిమా ప్రస్తుతం రిలీజ్ కి రెడీ గా ఉంది. ఈ ప్రాజెక్ట్ తరువాత విజయ్ తో సినిమాను చేయనున్నాడు లోకేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు