Manchu Lakshmi: నాపై ట్రోల్స్ ఆస్వాదిస్తా

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి పరిచయమైన మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట యాంకర్ గా తన కెరీర్ ని ప్రారంభించిన మంచు లక్ష్మి ఆ తరువాత పలు సినిమాలలో హీరోయిన్ గా మెప్పించింది. ఇక ఇటీవల మంచు లక్ష్మి నటించిన తాజా చిత్రం “మాన్ స్టర్”. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటి లో విడుదల కాగా.. హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

అయితే సోషల్ మీడియాలో మంచు లక్ష్మీపై జరిగే ట్రోలింగ్ గురించి తెలిసిన విషయమే. తనపై వచ్చే ట్రోల్స్, మీమ్స్ ను ఎంజాయ్ చేస్తుంటానని చెప్పింది మంచు లక్ష్మి. వాటిని సీరియస్ గా తీసుకోనని స్పష్టం చేసింది. అంతేకాదు మీమర్స్ ఇంకా కొత్తగా క్రియేట్ చేసేందుకు అవసరమైన కంటెంట్ ఇవ్వాలని ప్రతిసారి ప్రయత్నిస్తుంటానని చెప్పింది.

ఇక మాన్ స్టర్ సినిమాలో నటిస్తున్న సమయంలో భాషపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని పేర్కొంది. అలాగే ఈ చిత్రంలో మోహన్ లాల్ నటన గురించి మాట్లాడిన మంచు లక్ష్మి.. ఆయన సినిమాల్లో క్యారెక్టర్స్ విషయంలో చేసిన ప్రయోగానికి ఫిదా అయిపోయినట్లు చెప్పుకొచ్చింది. మోహన్ లాల్ తో ఏడాదికి ఒక్క సినిమానైనా చేయాలని ఉందని మంచు లక్ష్మి పేర్కొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు