Manchu Vishnu : సంచ‌ల‌నం

డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “జిన్నా”. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సూర్య డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. అవ్ర‌మ్ భ‌క్త మంచు ప్రెసెంట్స్‌, 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కోన వెంకట్ కథ‌, స్క్రీన్ ప్లే అందించగా.. అనుప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా విడుదల చేయాల్సింది. కానీ అదే రోజు గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ చిత్రాలు రిలీజ్ అవుతున్న కారణంగా అక్టోబర్ 21న ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన మీమ‌ర్స్ యూట్యూబర్స్ మీట్ లో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనపై, తన కుటుంబం పై జరుగుతున్న ట్రోలింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్ కి చెందిన ఓ హీరో తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని.. జూబ్లీహిల్స్ లోని తన ఐటీ కంపెనీలో ఒక కుటుంబం పై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మంచు విష్ణు ఆరోపించారు. త్వరలోనే పూర్తి సమాచారంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అలాగే నటుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కష్టపడతానని చెప్పారు. ” మా” అధ్యక్షుడిగా మళ్లీ పోటీ చేయబోతున్నారనే వార్తలపై స్పందిస్తూ.. ” నేను మళ్ళీ పోటీ చేయను. రాజకీయాలలోకి కూడా వెళతానని ప్రచారం జరుగుతోంది అది కూడా నిజం కాదు”. అని తెలిపాడు. తనని టార్గెట్ చేసే వారిని మాత్రం వదిలిపెట్టనని హెచ్చరించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు