Acharya : అందరికీ టార్గెట్ ఆయనే..

చిత్ర పరిశ్రమలో హిట్, ఫ్లాప్ లు కామన్. సినిమా ఫ్లాప్ అయినప్పుడు దర్శక నిర్మాతలు, హీరో కొంత వరకు నిరాశకు గురి అయినా, తర్వాతి సినిమాను మరింత మెరుగ్గా తీయాలని చూస్తారు. అయితే టాలీవుడ్ లో కొన్ని రోజుల ముందు డిజాస్టార్ ఫలితాన్ని ఇచ్చిన ఆచార్య విషయంలో మాత్రం అలా జరగలేదు. నిజానికి ఆచార్యపై భారీ అంచనాలు ఉండేవి. ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించారు.

దీంతో మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఈ సినిమా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టార్ నిలిచింది. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు. మెగా కంపౌడ్ హీరోలు కూడా తీవ్ర నిరాశకు గురి అయ్యారు. దీనికి కారణం.. డైరెక్టర్ కొరటాల శివనే అన్నట్టు చిత్రీకరించారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

అంతే కాకుండా సినిమా వచ్చిన నష్టాన్ని కూడా డైరెక్టర్ కొరటాలపైనే వేశారు. నష్టాన్ని భర్తీ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ కు డైరెక్టర్ కొరటాల మధ్య చాలా రోజుల పాటు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఆచార్య ఫలితం విషయంలో మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ గురించి చెప్పనవసరం లేదు.

- Advertisement -

తాజాగా మరోసారి డైరెక్టర్ కొరటాల టార్గెట్ అయ్యారు. ఈ సారి మెగా ఫ్యాన్స్ కాదు.. ఆచార్య మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ లో కొరటాల శివపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చాలా రోజుల నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు పని చేశానని, అదే అనుభవంతో అదే విధంగా ఆచార్యకు అందిచాలని ప్లాన్ చేశానని తెలిపాడు. అయితే డైరెక్టర్ కొరటాల శివ కొత్త వెర్షన్ తో చేద్దామని చెప్పాడని మణి శర్మ తెలిపాడు.

కాగా ఆచార్య సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. దీంతో సినిమా స్టోరీ తో పాటు మ్యూజిక్ కూడా ఫెయిల్ కావడానికి కొరటాల శివ కారణమని ఫ్యాన్స్ మరోసారి ఫైర్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు